పవన్ పన్నీర్ సెల్వంలా మారిపోయాడు

Update: 2018-03-16 03:44 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పన్నీర్ సెల్వంలా మారిపోయాడని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ తన సిద్ధాంతాలను మార్చుకున్నట్లు కన్పిస్తుందన్నారు. పవన్ వామపక్ష సిద్ధాంతాలను విడిచిపెట్టి పక్షపాత సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నట్లు కన్పిస్తుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన మోడీని విమర్శించకుండా పవన్ తన వాయిస్ మార్చడానికి కారణాలేంటో చెప్పాలన్నారు. పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి మిస్డ్ కాల్ ఏర్పాటుపై కూడా సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. మిస్డ్ కాల్ వస్తే జనసేన పార్టీలోనే చేరినట్టా? ఒక్కోసారి పొరపాటున కూడా మిస్డ్ కాల్స్ వస్తాయని ఎద్దేవా చేశారు. పవన్ కూడా జగన్ బాటనే పట్టినట్టుందన్నారు. జగన్ పార్టీ విధానాలను పవన్ దత్తత తీసుకున్నట్లుందని, పీఆర్పీ విషయంలో కూడా పవన్ ఇలాగే వ్యవహరించాడన్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే పవన్ దానిపై విమర్శలు చేయడమేంటని సోమిరెడ్డి ప్రశ్నించారు.

Similar News