దత్తాత్రేయపై తప్పుడు కేసులు పెట్టారు!

Update: 2016-04-04 14:15 GMT

హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) ఘటనపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌రావులపై తప్పుడు కేసులు నమోదు చేశారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబద్ నగర శివారుల్లోని కొంపల్లిలో బిజెపి తెలంగాణ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అయితే, ఇది అబద్దమని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, ప్రధాని నరేంద్ర మోడీని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

అలాగే తెలంగాణ కోసం టిఆర్ఎస్ ఒక్కటే ఉద్య మించలేదని, టిఆర్ఎస్ సర్కార్ ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవును నివారించడంలో ప్రభుత్వం విఫలమైం దని, కనీసం మంచినీళ్లు కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయిందని కిషన్ రెడ్డి అన్నారు

Similar News