తెలంగాణలోనూ ప్రత్యేక హోదా హీట్

Update: 2017-01-26 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరగుతున్న ప్రత్యేక హోదా పోరాటం వేడి తెలంగాణాకూ తాకింది. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలుకుతూ ప్రదర్శన నిర్వహించారు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు వద్ద ఐటీ ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏపీ యూత్ చేస్తున్ననిరసనకు మద్దతు తెలిపారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని వారు అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే రోజు ఐటీ కార్యాలయాలకు సెలవు దినం కావడంతో ఎక్కువ మంది యువతీ, యువకులు కేబీఆర్ పార్కు వద్దకు చేరుకుని ఏపీ యువతకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

తెలంగాణ రాజకీయ నేతలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అదే విధంగా హైకోర్టును విభజించటంలో ఏపీ ఎంపీలు తమకు మద్దతు తెలపాలని కోరారు. విడిపోయినా సోదరుల్లా కలిసి ఉండాలన్నదే తమ సిద్ధాంతమన్న కవిత, ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

Similar News