డీకే అరుణకు షాక్ ఇవ్వనున్న తమ్ముడు!

Update: 2016-04-14 00:47 GMT

మాజీ మంత్రి డీకె అరుణ సోదరుడు, మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొంత కాలంగా రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గద్వాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే ఆరుణకు రామ్మోహన్ రెడ్డి స్వయానా సోదరుడు.

ఎంపీ కవిత రామ్మోహన్ రెడ్డి సతీమణితో తనకున్న పరిచయాన్ని వినియోగించుకుని పావులు కదపడం ప్రారంభించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం డీకే అరుణను తన భార్యతో సహా కలిసిన రామ్మోహన్ రెడ్డి మనసులోని మాటను నిక్కచ్చిగా తెలిపాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని, వచ్చినా తన ఎదుగుదల ప్రశ్నార్థకమేనని, అలాంటప్పుడు కాంగ్రెస్ లోనే ఎందుకుండాలని ఆసమయంలో రామ్మెహన్ రెడ్డి, ఆయన భార్య వాదించినట్లు తెలిసింది.

రామ్మోహన్ రెడ్డి తెరాసలో చేరడం దాదాపు ఖాయమైందన్న విషయాన్ని కథనంలో స్పష్టంగా పేర్కొంది. అయితే సోదరుడికి నచ్చ చెప్పాలని అరుణ చేసిన ప్రయత్నాలు విఫలమ్యయాయి. రామ్మోహన్ రెడ్డితో జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి సంప్రదింపులు జరుపుతూ పార్టీలోకి ఆహ్వానించడంతో చివరకు ఆయన కారెక్కేందుకు సిద్దమయ్యారు. మంచి ముహూర్తం చూసుకుని కేసీఆర్ సమక్షంలో రామ్మోహన్ రెడ్డి పార్టీలో తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు.

Similar News