టీడీపీలో ఆ లక్కీ ఫెలో ఎవరో నేడు తేలనుందా?

Update: 2017-12-16 08:11 GMT

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ఈనెల 19వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో తిరిగి ఎన్నిక జరుగుతుండటంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిని అధికార తెలుగుదేశం పార్టీ ఎంపిక చేయనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు, కేఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. అయితే ఈ సీటుకోసం భారీగానే పార్టీ నుంచి ఆశావహులున్నారు. ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, కేఈ ప్రభాకర్ లు పోటీ పడుతున్నారు. మరి ఆ అదృష్ట వంతుడెవరో కళా వెంకట్రావు ఈ సమావేశంలో తేల్చకున్నా.. కర్నూలు నేతల అభిప్రాయాన్ని అధినేతకు తెలియజెప్పనున్నారు.

Similar News