జేడీయూ కొత్త అధ్యక్షుడిగా బిహార్ సీఎం నితీశ్కుమార్ ఆదివారం ఎన్నికయ్యారు. వరసగా మూడుసార్లు పదవిని చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు శరద్యాదవ్ పదవీ కాలం నేటితో ముగియనుంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నేడు జాతీయ మండలి సమావేశమైన విషయం తెలిసిందే. శరద్యాదవ్ మరోసారి పదవిలో కొనసాగాలంటే పార్టీ రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంది. అందుకు ఆయన తిరస్కరించారు. దీంతో పార్టీ కొత్త అధ్యక్షుడిగా నితీశ్ను ఎన్నుకొంది.