జగన్ వెంట అడుగులో అడుగు వేస్తూ....!

Update: 2017-11-07 03:41 GMT

వైసీపీ అధినేత జగన్ రెండోరోజు పాదయాత్ర ప్రారంభమయింది. వేంపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈరోజు 12.9 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేయనున్నారు. అయితే వేలాది మంది అభిమానులు పాదయాత్రలో జగన్ కు అండగా నిలబడేందుకు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఎందరో అభిమానులు జగన్ వెంట పాదయాత్ర చేస్తున్నారు. ఏడు నెలల పాటు ఆయనతోనే తాము అడుగులో అడుగు వేస్తామని చెబుతున్నారు. గతంలో వైఎస్ ఇచ్చిన సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు దక్కాయని, అందుకోసమే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు జగన్ వెంట నడవాలని తీర్మానించుకున్నామని కొందరు బహిరంగంగా చెబుతున్నారు. అయితే అభిమానులను, కార్యకర్తలను కట్టడి చేయడం పోలీసులకు సయితం కష్టంగా మారింది. జగన్ పాదయాత్ర కూడా నెమ్మదిగా సాగుతుండటానికి వేలాది మంది అభిమానులు తరలి రావడం వల్లనేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Similar News