చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు..!

Update: 2017-11-06 09:12 GMT

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు. రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఈచోరీ జరిగింది. కాగా రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లింది చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నచెన్నయ్య ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. చెన్నయ్య అలియాస్ చిన్నాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి వ్యక్తిగత కార్యదర్శి గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకునిదర్యాప్తుచేస్తున్నారు.

Similar News