తమిళనాడు ముఖ్యమంత్రిగా విశ్వాస పరీక్షలో నెగ్గిన పళనిస్వామి ఇక బెంగళూరు - చెన్నై తిరిగడటంతోనే సమయం సరిపోతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళను కలుసుకునేందుకు ఈనూతన సీఎం ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొట్టాల్సిందే. చిన్నమ్మ సలహా తీసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు పళనిస్వామి. తనను సీఎంగా చేసింది చిన్నమ్మే కాబట్టి ఆమెకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా పళనిస్వామి నిర్ణయించుకున్నారు.ఆమెను చెన్నై జైలు తరలించడమే తన మొదటి కర్తవ్యంగా భావిస్తున్నారు. లేకుంటే పళనిస్వామి నెలలో రెండు,మూడుసార్లు చెన్నై టు బెంగళూరు చక్కర్లు కొట్టాల్సిందే. ఇదే విషయంపై సినీనటుడు సిద్ధార్థ్ కూడా వెటకారంగా ట్వీట్ చేశారు. చిన్నమ్మకు ఒక ల్యాప్ ట్యాప్ కొనిస్తే...పళనిస్వామికి బెంగళూరు -చెన్నై రవాణా ఖర్చులన్నా మిగులుతాయని సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.