చాగంటి ని ఎపి సలహాదారుగా నియమించిన చంద్రబాబు!

Update: 2016-04-08 12:52 GMT

ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు అరుదైన గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ ఎన్‌ఏసీ ఫంక్షన్ హాలు (నాక్)లో శుక్రవారం ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చాగంటిని సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… చాగంటి ప్రవచనాలు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని, ఎంతో మందిని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. సమాజ హితం కోసం చాగంటిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు చెప్పారు.సీఎం చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులతో పాటూ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పొన్నలూరి నివాస గార్గేయ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం చేశారు.

Similar News