కోమటి రెడ్డి కి షాక్ ఇచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్!

Update: 2016-04-09 23:02 GMT

టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నుంచి వలసల ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకుల ఫిరాయింపుల జోరు ఎక్కువగా ఉంది. ఇప్పటికే కోదాడ మున్సిపల్ చైర్మన్, హుజూర్ నగర్ నగర పంచాయతీ చైర్మన్లు టీఆర్ఎస్ లో చేరిపోగా తాజాగా నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. శనివారం జిల్లా మంత్రి జగదీశ్వరరావు సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరులలో ఒకరైన లక్ష్మి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేసింది.

Similar News