ఆయనే ఆమరణ దీక్షకు దిగుతారా?

Update: 2018-04-04 06:25 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్ష నేతలతో విజయవాడలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ఆమరణ దీక్షపై నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ జరుగుతుంది. అలాగే వెనుకబడిన ప్రాంతాలైన ప్రకాశం, అనంతపురం, ఉత్తరాంధ్ర సమస్యలపై కూడా పవన్ వామపక్ష నేతలతో చర్చిస్తున్నారు. మరి ఆమరణ దీక్షపై పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి ఆ పార్టీ అభిమానుల్లో నెలకొని ఉంది.

Similar News