బ్రేకింగ్ : ప్రకటించిన అభ్యర్థిని మార్చేస్తున్న జగన్…??

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిని మార్చాలని భావిస్తోంది. ఈ స్థానాన్ని మొదట గోరంట్ల మాధవ్ కు పార్టీ కేటాయించింది. అనంతపురం జిల్లాలో సీఐగా విధులు [more]

Update: 2019-03-20 07:54 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిని మార్చాలని భావిస్తోంది. ఈ స్థానాన్ని మొదట గోరంట్ల మాధవ్ కు పార్టీ కేటాయించింది. అనంతపురం జిల్లాలో సీఐగా విధులు నిర్వర్తించిన ఆయన రెండు నెలల క్రితం తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ సామాజకవర్గానికి చెందిన వ్యక్తిని హిందూపురం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని భావించిన వైసీపీ గోరంట్ల మాధవ్ కు అవకాశం ఇచ్చింది. అయితే, రెండు నెలలుగా ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించలేదు. వీఆర్ఎస్ ఆమోదిస్తే గానీ నామినేషన్ చెల్లని పరిస్థితి ఉంది. దీంతో ఆయన కోర్టుకు వెళ్లారు. మరికాసేపట్లో కోర్టు తీర్పు రానుంది. ఒకవేళ మాధవ్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన స్థానంలో అదే సమాజకవర్గానికి చెందిన రిటైర్డ్ జడ్జి కురబ కిష్టప్పను నిలబెట్టాలని వైసీపీ భావిస్తోంది.

Tags:    

Similar News