మే 26న జగన్ ప్రమాణస్వీకారం

తమకు విజయంపై పూర్తి నమ్మకం ఉందని, మే 26న తమ తమ నాయకుడు వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి [more]

Update: 2019-04-26 12:46 GMT

తమకు విజయంపై పూర్తి నమ్మకం ఉందని, మే 26న తమ తమ నాయకుడు వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల తర్వాత సీఎం రోజుకో విన్యాసం చేస్తున్నారని అన్నారు. ఓడిపోతారని తెలిసే చంద్రబాబు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్ల కాలాన్ని వృధా చేశారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజధానిలో పర్మనెంటు పేరిట ఒక్క ఇటుక కూడా ఎందుకు వేయలేదన్నారు. కేవలం పోలవరంలో కమీషన్ల కోసమే చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మీద బాబు పెత్తనం పోతుందనే జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రిని అని బాబు చెబుతున్నారని, ఇదేనా 40 ఏళ్లు అనుభవం అని ప్రశ్నించారు. జగన్ మే 26న ప్రమాణస్వీకారం చేస్తే జూన్ 8 వరకు చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ప్రశ్నించారు.

Tags:    

Similar News