వైసీపీలోకి టీడీపీ నేత

Update: 2018-06-23 11:29 GMT

ప్రకాశ్ జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలతో సమావేశమయ్యారు. అనంతరం త్వరలోనే పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ముహూర్త ఖరారు కావాల్సి ఉంది. 2009లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయగా ఓడిపోయారు. ఇక్కడి నుంచి వైసీపీ తరుపున ముత్తముల అశోక్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు అశోక్ రెడ్డికి తెలుగుదేశం కండువా కప్పారు. అతడి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన అన్నా రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. గిద్దలూరుతో పాటు మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అన్నా రాంబాబుకు మంచి పట్టుంది.

Similar News