జగన్ పై మరోసారి…?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ మరోసారి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. సభ్యులను కించపరుస్తూ జగన్ మాట్లాడినందున నోటీసు ఇచ్కినట్లు టీడీపీ [more]

Update: 2019-12-17 03:36 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ మరోసారి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. సభ్యులను కించపరుస్తూ జగన్ మాట్లాడినందున నోటీసు ఇచ్కినట్లు టీడీపీ నేతలు చెప్పారు. ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ జగన్ కించపర్చాడని ఈ నోటీసును టీడీపీ ఇచ్చింది. సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. కాగా ఉచిత ఇసుకపాలసీ, నదుల అనుసంధానంపై టీడీపీ శాసనసభ్యులు అసెంబ్లీ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తూ దౌర్జన్యాలకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. రాష్ట్రాన్ని ఆరునెలల్లో జగన్ భ్రష్టు పట్టిస్తున్నారన్నారు చంద్రబాబు. రివర్స్ టెండర్ల పేరుతో జగన్ తన అనుయాయులకు ఇంట్లో కూర్చుని టెండర్లను ఖరారు చేస్తున్నారన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News