నేడు కర్నూలుకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొననున్నారు. ఈరోజు కర్నూలులోని సంకల్ భాగ్ పుష్కర్ ఘాట్ ను జగన్ [more]

Update: 2020-11-20 02:23 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొననున్నారు. ఈరోజు కర్నూలులోని సంకల్ భాగ్ పుష్కర్ ఘాట్ ను జగన్ సందర్శిస్తారు. తుంగభద్ర పుష్కరాలకు చేసిన ఏర్పాట్లను జగన్ పరిశీలిస్తారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జగన్ పర్యటన ఉంటుందని అధికారులు చెప్పారు. జగన్ పర్యటించే సమయంలో పుష్కర్ ఘాట్ వద్దకు మంత్రులు, ఎమ్మెల్యేలకు తప్ప ఎవరికీ అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. సీఎం జగన్ పర్యటన పూర్తయిన తర్వాతనే ఇతరులను ఘాట్ లోకి అనుమతిస్తారు.

Tags:    

Similar News