పేద పిల్లలూ టై కట్టుకోవాలి

పేదపిల్లలు టైకట్టుకుని ధైర్యంగా తిరగాలని, కార్లలో వెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ముమ్మడివరంలో జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడారు. ఐదు నెలల [more]

Update: 2019-11-21 07:37 GMT

పేదపిల్లలు టైకట్టుకుని ధైర్యంగా తిరగాలని, కార్లలో వెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ముమ్మడివరంలో జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడారు. ఐదు నెలల నుంచి ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నప్పటికీ ఎలాంటి అపనిందలు వేస్తున్నారో చూస్తున్నారన్నారు. దుష్ప్రచారం చేస్తూ బ్యాక్ వార్డ్ క్లాస్ ను బ్యాక్ బోన్ క్లాస్ గా మార్చాలనుకోవడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. తప్పుగా మాట్లాడుతున్న నాయకులు, పత్రికాధిపతులను నిలదీయమని జగన్ కోరారు. వారి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, పేదపిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలా? అని అడగమన్నారు. ఎంతమంది శత్రువులు తనకు తయారయినా భయపడేది లేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదావరిలో మునిగిన బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యాన్ని జగన్ సత్కరించారు. ఇంగ్లీష్ మీడియంను వచ్చే ఏడాది నుంచి అమలుచేస్తున్నామని మరోసారి జగన్ ప్రకటించారు.

Tags:    

Similar News