వైసీపీ నేతకు అండగా ఉంటానన్న జగన్

జగన్ కడప జిల్లా పర్యటనలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ నేతను జగన్ పరామర్శించారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నల్లచెరువు పల్లె [more]

Update: 2020-12-25 05:04 GMT

జగన్ కడప జిల్లా పర్యటనలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ నేతను జగన్ పరామర్శించారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నల్లచెరువు పల్లె గ్రామానికి చెందిన వైసీపీ నేత రామగిరి జనార్థన్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న జగన్ వారి కుటుంబ సభ్యులను ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి వెంటనే కుటుంబ సభ్యులు రామగిరి జనార్థన్ రెడ్డిని వాహనంలో హెలిప్యాడ్ వద్దకు తీసుకువచ్చారు. వాహనంలో ఉన్న రామగిరి జనార్థన్ రెడ్డిని జగన్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. తాను అండగా ఉంటానని, చికిత్స కోసం ఎంత ఖర్చయినా వెనకాడవద్దని జగన్ సూచించినట్లు తెలిసింది.

Tags:    

Similar News