జగన్ నివాసం వద్ద సందడే సందడి..!

అమరావతిలోని తాడేపల్లిలో కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. కనీవినీ ఎరుగని భారీ విజయం సాధించిన జగన్ ను కలిసేందుకు [more]

Update: 2019-05-24 06:36 GMT

అమరావతిలోని తాడేపల్లిలో కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. కనీవినీ ఎరుగని భారీ విజయం సాధించిన జగన్ ను కలిసేందుకు పార్టీ నూతన ఎమ్మెల్యే, నేతలు క్యూ కట్టారు. జగన్ ను కలిసి వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలు విభాగాల ఉన్నతాధికారులు సైతం జగన్ ను కలుస్తున్నారు. తిరుమల నుంచి టీటీడీ ఈవో అనీల్ సంఘాట్, వేద పండితులు జగన్ ను కలిశారు. వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News