బ్రేకింగ్ : జగన్ బ్రహ్మాస్త్రం వదిలేశారు….!!!

మధ్య తరగతి ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భారీ హామీ ఇచ్చారు. శుక్రవారం గుంటూరు నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో జగన్ [more]

Update: 2019-04-05 12:26 GMT

మధ్య తరగతి ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భారీ హామీ ఇచ్చారు. శుక్రవారం గుంటూరు నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో జగన్ మాట్లాడుతూ… పేద వారికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. పేద వారికి ఆరోగ్యశ్రీ పరిమితమవుతోందన్నారు. అయితే, నగరాల్లో మధ్య తరగతిగా ఉన్న వారికి కూడా వైద్యం చేయించుకోవడం కష్టంగా మారిందన్నారు. మధ్య తరగతి ప్రజల కోసం ఏడాదికి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి కూడా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే వీరికి యూనివర్సల్ హెల్త్ కార్డు ఇస్తామని, రూ.1000 కంటే ఎక్కువ వైద్యం కోసం ఖర్చయితే ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తానే స్వయంగా ఈ పథకాన్ని పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News