జగన్ అను నేను

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ‘జగన్ అనే నేను’ వినాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానుల [more]

Update: 2019-05-30 06:55 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ‘జగన్ అనే నేను’ వినాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో జగన్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. తమ అభిమాన నేత ప్రమాణస్వీకారాన్ని వీక్షించేందుకు వేలాదిగా జగన్ అభిమానులు ఇందిరా గాంధీ స్టేడియానికి తరలివచ్చారు. స్టేడియం మొత్తం తిరిగి జగన్ వారికి అభివాదం చేశారు.

Tags:    

Similar News