జగన్ ప్రమాణస్వీకారం చేసేది అక్కడే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారైంది. ఆయన ప్రమాణస్వీకార ఏర్పాట్లపై శనివారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం [more]

Update: 2019-05-25 10:14 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారైంది. ఆయన ప్రమాణస్వీకార ఏర్పాట్లపై శనివారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులతో సమీక్ష జరిపారు. డీజీపీ ఠాకూర్, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమవేశంలో పాల్గొన్నారు. విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ స్టేడియాన్ని ప్రమాణ స్వీకారానికి వేదికగా ఖరారు చేశారు. ఈ స్టేడియం కేపాసిటీ 50 వేలు. ఈ నెల 30వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 11.00 వరకు జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

Tags:    

Similar News