పులివెందుల నుంచే జగన్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన పులివెందుల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ సరళిని [more]

Update: 2019-04-11 07:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన పులివెందుల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. వివిధ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభ్యర్థులతో ఆయన ఫోన్ ద్వారా వివరాలను తెలుసుకుంటున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న దాడుల గురించి జగన్ తెలుసుకున్నారు.

Tags:    

Similar News