వైఎస్ జగన్ విదేశీ పర్యటన..!

ఎన్నికల బిజీలో ఇంతకాలం తీరిక లేకుండా గడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లి కాస్త సేద తీరనున్నారు. ఆయన కుటుంబంతో [more]

Update: 2019-04-22 09:47 GMT

ఎన్నికల బిజీలో ఇంతకాలం తీరిక లేకుండా గడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లి కాస్త సేద తీరనున్నారు. ఆయన కుటుంబంతో కలిసి స్విట్జర్ల్యాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి ఆయనకు సీబీఐ కోర్టుకు కూడా 27వ తేదీ వరకు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఆయన స్విట్జర్ల్యాండ్ కు వెళ్లనున్నారు. ఐదు రోజుల తర్వాత జగన్ తిరిగిరానున్నారు. ఓ వైపు ఎన్నికలు ముగిసినా చంద్రబాబు తీరిక లేకుండా ఈసీపై పోరాటం, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం, రాష్ట్రంలో సమీక్షలు అంటూ బిజీగా ఉంటుండగా, జగన్ మాత్రం టెన్షన్ లేకుండా విదేశాలకు వెళుతుండటం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News