నా కష్టం వారికి సంబరం… జగన్ భావోద్వేగం

తనకు కష్టం వస్తే చంద్రబాబు, ఆయన యెల్లో మీడియా సంబరపడతారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన పాలకొల్లు ఎన్నికల ప్రచారసభలో [more]

Update: 2019-03-28 07:57 GMT

తనకు కష్టం వస్తే చంద్రబాబు, ఆయన యెల్లో మీడియా సంబరపడతారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన పాలకొల్లు ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ… 3600 కిలో మీటర్లు, 14 నెలల పాటు చేసిన పాదయాత్రలో ప్రజలంతా తనను చూశారని, ప్రతీ రోజూ ప్రజలతోనే ఉన్నానని పేర్కొన్నారు. తాను ఎలాంటి వాడినో ప్రజలందరికీ తెలుసన్నారు. కానీ ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు తనపై మాట్లాడుతున్న మాటలు, తనపై ఆయన చేస్తున్న కుట్రలు చూస్తుంటే బాధనిపిస్తుందన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో ఎవరికి, ఎక్కడ, ఏ కష్టం వచ్చినా తాను అక్కడ ఉన్నానని, కానీ తనకు కలిగిన ప్రతీ కష్టమూ చంద్రబాబుకు, యెల్లో మీడియాకు ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. చివరకు తన చిన్నాన్న హత్యను కూడా పండుగ చేసుకున్నారని పేర్కొన్నారు. రాజకీయాల, మీడియా దిగజారిన పరిస్థితికి ఇదే నిదర్శనమన్నారు.

Tags:    

Similar News