వైసీపీలోకి పసుపు పార్టీ నేత

Update: 2018-04-06 07:15 GMT

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికలకు ముందే వలసలు భారీగా పెరిగేటట్లున్నాయి. తాజాగా నందిగామ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ లో చేరుతున్నారు. ఈ మేరకు ఆయన జగన్ తో సంప్రదింపులు జరిపారు. వసంత కృష‌్ణ ప్రసాద్ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. అయితే టీడీపీలో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో కృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకోగానే ఆయన ఫ్యాన్ పార్టీలో చేరతారన్న ప్రచారం బెజవాడలో జోరుగా జరుగుతోంది.

Similar News