బ్రేకింగ్: పాదయాత్ర తర్వాత తొలి అభ్యర్థిని ప్రకటించిన జగన్

రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న మరో అభ్యర్థిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్ధారెడ్డి నిలబడనున్నట్లు ఆ పార్టీ జిల్లా [more]

Update: 2019-01-21 09:30 GMT

రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న మరో అభ్యర్థిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్ధారెడ్డి నిలబడనున్నట్లు ఆ పార్టీ జిల్లా ఇంఛార్జి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచిన చాంద్ పాషా పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కదిరిలో పార్టీ బాధ్యతలను సిద్ధారెడ్డి చూసుకుంటున్నారు. జగన్ పాదయాత్రకు కూడా ఈ నియోజకవర్గంలో మంచి స్పందన వచ్చింది. దీంతో సిద్ధారెడ్డి అయితేనే సరైన అభ్యర్థి అని భావించిన పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. జగన్ ఆదేశాల మేరకు సిద్ధారెడ్డిని అభ్యర్థికి ప్రకటిస్తున్నట్లు మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News