బిగ్ బ్రేకింగ్ : విశాఖకు రైల్వే జోన్

విశాఖకు రైల్వే జోన్ ను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ [more]

Update: 2019-02-27 14:06 GMT

విశాఖకు రైల్వే జోన్ ను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. విభజన హామీల్లో భాగంగా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఆ హామీ ఆచరణలోకి రాలేదు. ఇటీవల బీజేపీ నేతలు కూడా రైల్వే మంత్రి పియూష్ గోయల్ ను కలిసి రైల్వే జోన్ ను విశాఖకు కేటాయించాలని కోరారు. ఇటీవలే చంద్రబాబునాయుడు సయితం పియూష్ గోయల్ కు లేఖ రాశారు. బీజేపీ నేతలు చెప్పినట్లే విశాఖకు రైల్వే జోన్ ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News