రాజీ కోస‌మే రామోజీని క‌లిశారా..?

ఏ స‌ల‌హా కోసం, ఏ స‌హాయం కోసం రామోజీ రావును క‌లిశార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న చంద్ర‌బాబుపై [more]

Update: 2019-05-16 11:12 GMT

ఏ స‌ల‌హా కోసం, ఏ స‌హాయం కోసం రామోజీ రావును క‌లిశార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న చంద్ర‌బాబుపై ప్ర‌శ్న‌లు సంధిస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు. ప్ర‌జాధ‌నంతో హెలీకాఫ్ట‌ర్ లో వెళ్లి రామోజీని క‌లవాల్సినంత ముఖ్య‌మైన ప‌ని ఏంతో ప్ర‌జ‌ల‌కు చెప్పే ధైర్యం ఉందా అని అడిగారు. ఓడిపోయాక ఎక్క‌డ ఆశ్ర‌యం పొందాలో, కేసీఆర్ తో రాజీ కుదుర్చాల‌ని ప్ర‌ాధేయ‌ప‌డ‌టానికి వెళ్లారా అని, ఇంత దిగ‌జారిపోయారేంట‌ని ప్ర‌శ్నించారు. తాను చేసిన నాలుగు స‌ర్వేల్లో టీడీపీ విజయం సాధిస్తుంద‌ని చెబుతున్న చంద్ర‌బాబు ఎగ్జిట్ పోల్స్ ను న‌మ్మొద్ద‌ని చెబుతున్నారంటే వింత‌గా ఉంద‌న్నారు. మీడియా ఇంత‌గా విస్త‌రించిన త‌ర్వాత ఏది న‌మ్మాలో ఏదో న‌మ్మొద్దో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు.

Tags:    

Similar News