లోకేష్ చచ్చు దద్దమ్మ

వల్లభనేని వంశీ మరోసారి ఫైరయ్యారు. తాను ఆస్తుల కోసమే పార్టీని వీడానని లోకేష్ అనడంపై వంశీ ఫైరయ్యారు. తనకు ఏ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని వల్లభనేని [more]

Update: 2019-11-15 11:34 GMT

వల్లభనేని వంశీ మరోసారి ఫైరయ్యారు. తాను ఆస్తుల కోసమే పార్టీని వీడానని లోకేష్ అనడంపై వంశీ ఫైరయ్యారు. తనకు ఏ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని వల్లభనేని వంశీ అన్నారు. లోకేష్ దద్దమ్మ అని వంశీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కు నక్కకు నాగలోకానికి అంత తేడా ఉందన్నారు. లోకేష్ చచ్చుదద్దమ్మ అన్నారు. పది జన్మలెత్తినా జూనియర్ ఎన్టీఆర్ స్థాయి లోకేష్ కు లేదని వల్లభనేని వంశీ అన్నారు. అందుకే మంగళగిరిలో ఓటమి పాలయ్యారన్నారు. ముఖ్యమంత్రి అవుదామని అత్యాశ పడుతున్నారన్నారు. లోకేష్ లా కాదు తాను స్వయంకృషితో రాజకీయంగా ఎదిగానన్నారు. తనపై సోషల్ మీడియలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టిస్తున్నారన్నారు. నారా లోకేష్ ఒక పప్పు అని.. వాడిలాగా తాను అమ్మనో, అయ్యనో అడ్డంపెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదన్నారు. చంద్రబాబు లేని రోజు వాడి బతుకేందో తెలుస్తుందన్నారు. సోషల్ మీడియాను అడ్డంపెట్టుకునే నారా లోకేష్ బతుకుతున్నారన్నారు. వాడొక బాల్ బచ్చా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News