వైసీపీ అధినేత జగన్ కు ప్రజల్లో క్రేజ్ పెరుగుతోందని, వేవ్ ఉందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. జగన్ కు వేవ్ క్రమంగా పెరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలువవస్తే జగన్ కేఎక్కువ సీట్లు వస్తాయని అన్నారు. ప్రజల్లో బలం జగన్ కు ఉందని చెప్పారు.అయితే జగన్ కు ఉన్న వేవ్ ను తిప్పుకోగల సామర్థ్యం చంద్రబాబుకు ఉందని ఉండవల్లి చెప్పారు. జగన్ కు ఎన్నికల వ్యూహ బృందం లేదని అన్నారు. పోలవరం పూర్తి కావడానికి మరో ఐదారేళ్లు పట్టే అవకాశముందని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ బలాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని ఉండవల్లి తెలిపారు.