గెలవబోతోంది వైసీపీయే..కేటీఆర్ జోస్యం

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు ఢిల్లీలో కాదు కదా కనీసం అమరావతిలో కూడా [more]

Update: 2019-02-23 10:18 GMT

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు ఢిల్లీలో కాదు కదా కనీసం అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని పేర్కొన్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలవబోతోందని అంచనా వేశారు. చంద్రబాబు చేతకాని తనం వల్లే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నారని అన్నారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు ప్రజలను వేధించారని తెలిపారు. దేశమంతా ఐటీ దాడులు జరుగుతున్నాయని, చంద్రబాబు మాత్రమే ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రాకు వ్యతిరేకంగా తాము ఏం చేశామో చంద్రబాబు చెప్పాలన్నారు. ఓ వైపు కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని చంద్రబాబు చెబుతున్నారని.. అదే సమయంలో అన్నింటిలో రాష్ట్రమే నెంబర్ వన్ అంటున్నారని పేర్కొన్నారు. ఇక, వచ్చే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీకి తగినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదని, తెలంగాణలో 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్, కమాండ్ చేసే అవకాశం ఉంటుందన్నారు.

Tags:    

Similar News