పవన్ కు రత్న ప్రభ ఆహ్వానం….?

తిరుపతి లోక్ సభ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె తిరుపతి ఉప ఎన్నికలపై పవన్ కల్యాణ్ [more]

Update: 2021-03-27 01:22 GMT

తిరుపతి లోక్ సభ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె తిరుపతి ఉప ఎన్నికలపై పవన్ కల్యాణ్ తో చర్చించారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్న ప్రభను పోటీకి దింపుతున్న సంగతి తెలిసిందే. ప్రచారానికి రావాల్సిందిగా రత్న ప్రభ పవన్ కల్యాణ్ నుకోరినట్లు తెలిసింది. ఇందుకు పవన్ కల్యాణ‌్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో పాటు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్, సోము వీర్రాజు, పురంద్రీశ్వరి కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News