మోడీకి తిరుగులేదా? ఆ సర్వే అదే చెప్పిందే...!

Update: 2018-05-26 13:27 GMT

ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్ గ్రూప్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీకి రానున్న ఎన్నికల్లో తిరుగులేదని తేల్చింది. ఆ సంస్థకు తొమ్మది భాషల్లో ఉన్న తొమ్మది వార్తా మాధ్యమాల ద్వారా ఈ నెల 23 నుంచి 25 వరకు సర్వే నిర్వహించింది. ‘ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారు ?’ అనే ప్రశ్నకు 8,44,646 మంది జవాబు చెప్పారు. ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ సర్వేలో మోదీకి అనుకూలంగా ఊహించని ఫలితాలు వచ్చాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 71.95 శాతం మంది తమ ఓటు నరేంద్ర మోదీకేనని తేల్చి చెప్పారు. 73.3 శాతం మంది మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు.

Similar News