బ్రేకింగ్ : ఏపీలోనూ మరో మూడు పాజిటివ్ కేసులు

ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దంపతులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకింది. కర్నూలు జిల్లాకు [more]

Update: 2020-03-28 13:32 GMT

ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దంపతులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకింది. కర్నూలు జిల్లాకు చెందిన మరో వ్యక్తి కరోనా పాజిటివ్ కేసు నమోదయిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 16కు చేరుకున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలోని నవాబ్ పేట్ కు చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అయితే ఈ దంపతులు ఇద్దరూ వృద్ధులు కావడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News