మండలిలో ఆ నలుగురు

శాసనమండలిలో తెలుగుదేశంపార్టీ బలంగా ఉంది. ఏ బిల్లులనైనా అడ్డుకునేంత శక్తి ఉంది. అయితే శాసనమండలిలో టీడీపీకి చెందిన నలుగురు సభ్యులు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా [more]

Update: 2020-01-22 02:18 GMT

శాసనమండలిలో తెలుగుదేశంపార్టీ బలంగా ఉంది. ఏ బిల్లులనైనా అడ్డుకునేంత శక్తి ఉంది. అయితే శాసనమండలిలో టీడీపీకి చెందిన నలుగురు సభ్యులు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కీలక బిల్లులు వచ్చే సమయంలో, రాజధాని బిల్లును అడ్డుకోవాల్సిన పరిస్థితుల్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా ఎందుకు చేశారన్నది ప్రశ్న. మరో సభ్యురాలు శమంతకమణి అనారోగ్యంతో సభకు హాజరు కాలేదు. ఇక శాసనమండలిలో జరిగిన ఓటింగ్ లో చీరాలకు చెందిన పోతుల సునీత, జమ్మలమడుగుకు చెందిన శివనాధ్ రెడ్డిలు టీడీపీకి వ్యతిరేకరంగా ఓటు వేశారు. దీంతో చంద్రబాబు వీరి విషయంపై సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలిసింది.

Tags:    

Similar News