ఓటింగ్ ప్రారంభం కాగానే వారిద్దరూ?

శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ ప్రారంభమవుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. స్పీకర్ ప్రకటించిన వెంటనే టీడీపీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి సభ [more]

Update: 2020-01-27 12:56 GMT

శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ ప్రారంభమవుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. స్పీకర్ ప్రకటించిన వెంటనే టీడీపీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. శాసనమండలి రద్దుపై చర్చ జరిగే సభకు తాము హాజరు కాబోమని టీడీఎల్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ శాసనసభకు హాజరయ్యారు. కానీ ఓటింగ్ లో పాల్గొన లేదు. వీరిద్దరూ ఇటీవల టీడీపీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News