బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు బై..... బై

Update: 2018-09-20 03:36 GMT

ఆదిలాబాద్ కు చెందిన రమేష్ రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పేశారు. ఏడాదిన్నర క్రితం ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో హవా కొనసాగించారు. అయితే ఖానాపూర్ టిక్కెట్ ను ఆశించిన రమేష్ రాథోడ్ కు నిరాశే ఎదురయింది. ఖానాపూర్ టిక్కెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కే కేసీఆర్ కేటాయించడంతో ఆయన పార్టీని వీడారు. రేపు ఆయన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రమేష్ రాథోడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముంది.

Similar News