జంబో కమిటీ…219 మందితో…?

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. అయితే మొత్తం 219 మంది తో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు టీడీపీ లో ఉన్న నేతలందరికీ రాష్ట్ర [more]

Update: 2020-11-06 05:47 GMT

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. అయితే మొత్తం 219 మంది తో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు టీడీపీ లో ఉన్న నేతలందరికీ రాష్ట్ర కమిటీలో చంద్రబాబు అవకాశం కల్పించారు. 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు ఇందులో ఉన్నారు. వీరితో పాటు 18 మంది అధికార ప్రతినిధులు, 58 నిర్వాహక కార్యదర్శులను నియమించారు. ఇక కమిటీలో 108 మంది రాష్ట్ర కార్యదర్శులను నియమించారు. టీడీపీ కమిటీలో ఎస్సీ, ఎస్టీ. బీసీలకు 61 శాతం పదవులను కేటాయించారు. మైనారిటీలకు కూడా ప్రాధాన్యమిచ్చారు.

Tags:    

Similar News