పింఛన్ కోసం వచ్చిన వృద్ధుడిపై చింతమనేని చిందులు

పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిగాపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిందులు తొక్కారు. ‘నీ కొడుకులు వైఎస్సార్సీపీలో తిరుగుతుంటే.. నొవ్వొచ్చి పింఛన్ తీసుకోవడానికి సిగ్గులేదా’ అంటూ అవమానించారు. [more]

Update: 2019-02-04 05:47 GMT

పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిగాపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిందులు తొక్కారు. ‘నీ కొడుకులు వైఎస్సార్సీపీలో తిరుగుతుంటే.. నొవ్వొచ్చి పింఛన్ తీసుకోవడానికి సిగ్గులేదా’ అంటూ అవమానించారు. వివరాల్లోకెళ్తే… పెదవేగి మండలంలోని విజయరాయి గ్రామంలో పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చింతమనేని మహిళలను ఇంటింటికి పంపించి బొట్లు పెట్టించి మరీ ఆహ్వానించారు. సుబ్బారావు అనే వృద్ధుడు పింఛన్ తీసుకోవడానికి వచ్చారు. అతడిని చూసిన ఎమ్మెల్యే ప్రభాకర్… నీ కొడుకులు వైసీపీలో తీరుగుతుంటే మేమిచ్చే పింఛన్ ఎందుకు తీసుకుంటున్నావంటూ దుర్భాషలాడారు.

కుమారుడిపైనా దౌర్జన్యం

ఈ విషయం తెలియగానే సుబ్బారావు కుమారుడు రాధాకృష్ణ తండ్రిని తీసుకెళ్లేందుకు కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి వచ్చాడు. దీంతో అతడిపైనా చింతమనేని దౌర్జన్యం చేశారు. తోపులాట జరగగా వృద్ధుడు సుబ్బారావు కాలికి గాయమైంది. తన తండ్రిని అవమానించడంపై రాధాకృష్ణ ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే మైక్ పడేసి వెళ్లిపోయాడు. అయితే, పోలీసలు మాత్రం రాధాకృష్ణను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రాధాకృష్ణను విడుదల చేయాలంటూ వైసీపీ నేతలు పోలిస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News