బాబూ….బాధ్యత ఉండక్కర్లా

టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. కరోనా విషయంలో ప్రజలను భయపెట్టే విధంగా మాట్లాడటం విచారకరమన్నారు. వైద్యులతో వీడియో [more]

Update: 2020-07-27 06:44 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. కరోనా విషయంలో ప్రజలను భయపెట్టే విధంగా మాట్లాడటం విచారకరమన్నారు. వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డాక్టర్ నయనా నియమించలేదని, కనీసం ఆంబులెన్స్ లు కూడా కొనుగోలు చేయలేదన్నారు. తాను అధికారంలో ఉండగా ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోకుండా వదిలేశారన్నారు. ఆసుపత్రులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా తమ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడేది లేదని తెలిపారు. హైదరాబాద్ లో కూర్చుని కరోనా విషయంలో చంద్రబాబు విమర్శించడం విడ్డూరమన్నారు.

Tags:    

Similar News