ఆ రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే..?

Update: 2018-10-22 08:35 GMT

తెలంగాణ ఎన్నికల్లో బలం ఉన్న చోటే పోటీ చేసి సత్తా చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ బలంగా ఉన్న స్థానాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. ఇందులో భాగంగా సెటిలర్లు అధికంగా ఉండే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో టీడీపీ బలంగా ఉందని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపివే విజయం సాధించడం సులువు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి స్థానం నుంచి ఇనగాల పెద్దిరెడ్డి, శేరిలింగంపల్లి నుంచి భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ ను బరిలో దించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Similar News