ఆయనతో జగన్ రహస్య భేటీ అయ్యారా…?

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ప్రతీరోజూ సరికొత్త ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ మరో రెండు ఆరోపణలు చేశారు. [more]

Update: 2019-02-23 09:50 GMT

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ప్రతీరోజూ సరికొత్త ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ మరో రెండు ఆరోపణలు చేశారు. లండన్ లో జగన్.. విజయ్ మాల్యాతో రహస్య భేటీ అయ్యారని టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయ్ మాల్యా దగ్గర మిగిలి ఉన్న డబ్బును హవాలా రూపంలో వైసీపీకి విరాళాల పేరుతో తీసుకువచ్చేందుకే జగన్ లండన్ వెళ్లారని తెలిపారు. జగన్ లండన్ పర్యటనపై నరేంద్ర మోడీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. జగన్ లండన్ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

చెన్నైలో వారి రహస్య భేటీ

ఇక, నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, టీఆర్ఎస్ నేత సంతోష్ రెడ్డి, సినీ నటుడు మోహన్ బాబు, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి రహస్య భేటీ అయ్యారని, ఎన్నికల నిధులు సమకూర్చుకోవడం కోసమే వీరి భేటీ జరిగిందన్నారు. దొంగ సర్వేలతో మోడీ, కేసీఆర్, జగన్ ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో టీడీపీ 150 అసెంబ్లీ స్థానాలు, 20 ఎంపీ సీట్లు దక్కించుకోవడం ఖాయమన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లినందున… ఓటుకు 10 వేలు ఇచ్చయనా గెలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.

Tags:    

Similar News