తలసానికి థర్డ్ టైమ్

సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బీసీ కోటాలో మరోసారి మంత్రి పదవి దక్కింది. ఆయన [more]

Update: 2019-02-19 06:20 GMT

సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బీసీ కోటాలో మరోసారి మంత్రి పదవి దక్కింది. ఆయన 2014లో తెలుగుదేశం పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు అప్పుడే మంత్రిపదవి దక్కింది. నమ్మకంగా పనిచేశారనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నుంచి మరోసారి ఆయనకు మొదటి విడతలోనే కేసీఆర్ మంత్రి పదవిని కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో పర్యాటక శాఖతో పాటు పశుసంవర్ధక శాఖ బాధ్యతలు చెపట్టిన ఆయనకు ఈసారి పౌర సరఫరాల శాఖ కేటాయించే అవకాశం ఉంది. తలసాని మంత్రిపదవి స్వీకరించడం ఇది మూడోసారి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేశారు.

Tags:    

Similar News