జగన్ కు సుజనా వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అతి [more]

Update: 2019-11-05 11:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా, అవమానకరంగా బదిలీ చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన కొనసాగుతుందన్నారు. అధికారులకు ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదనిపిస్తోందన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజావ్యతిరేకమైనవని తెలిసినా అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కళ్లుమూసుకుని కూర్చుని లేదని ఆయన కూడా జగన్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

Tags:    

Similar News