బ్రేకింగ్ : భారత్ లో కట్టలు తెంచుకుంటున్న కరోనా.. ఈ ఒక్కరోజే

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 48,661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా [more]

Update: 2020-07-26 04:48 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 48,661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,85,552 కు చేరుకుంది. ఒక్కరోజే 705 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 32,063గా ఉంది. ఇప్పి వరకూ భారత్ లో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 8.85 లక్షలుగా ఉంది. ప్రస్తుతం భారత్ కరోనా యాక్టివ్ కేసులు 4.67 లక్షలున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News