అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తమ పార్టీలో చేరేందుకు వైసీపీ, టీడీపీకిచెందిన మాజీ మంత్రులు [more]

Update: 2021-02-04 08:10 GMT

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తమ పార్టీలో చేరేందుకు వైసీపీ, టీడీపీకిచెందిన మాజీ మంత్రులు సిద్ధమవుతున్నారని, త్వరలో చేరికలుంటాయని సోము వీర్రాజు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీ చేయకుండా వైసీపీ నేతలు బెదిరిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు హోంమంత్రిని అవుతానని చెబుతున్నారని, అసలు టీడీపీ అధికారంలోకి వస్తే కదా? అని ఆయన చమత్కరించారు.

Tags:    

Similar News