పుదుచ్చేరికి ప్రత్యేక హోదానా?

పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని [more]

Update: 2021-04-02 00:52 GMT

పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా కేంద్ర ప్రభుత్వం చూపిందన్నారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో పుదుచ్చేరికి ఎలా హోదా ఇస్తామని చెప్పిందని శైలజానాధ్ నిలదీశారు. అసలు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. జగన్ కేంద్రాన్ని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News