ఆ డబ్బాల్లో డబ్బులున్నాయి

Update: 2018-08-25 13:40 GMT

ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని టీఆర్ఎస్ నేతలకు హామీ ఇచ్చిన కేసీఆర్ పై ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెడతానని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారని, అసలు ఆయనకు అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రగతి నివేదన సభ కోసం ఒక్కో ఎమ్మెల్యేకు కోటి రూపాయాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత ఎన్నికల సామాగ్రి అంటూ కాటన్ బాక్సులు ఇచ్చారని, వాటిలో ప్రచార సామాగ్రే ఉంటే రెండు మూడు వేల విలువ కూడా చేయవని ఆయన పేర్కొన్నారు. అంత తక్కువ విలువ చేసే డబ్బాల కోసం ఎమ్మెల్యేలు ఎగబడ్డారని, గన్ మెన్ల పహారాలో ఆ బాక్సులు తీసుకెళ్లారని ఆయన తెలిపారు. ఆ డబ్బాల్లో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.కోటి ఇచ్చి పంపించారని సంచలన ఆరోపణలు చేశారు.

Similar News